Crimejournalist

Feb 23 2024, 08:04

పట్టుదల ముందు పేదరికం అడ్డు కాదు - బీసీ జిల్లా అధ్యక్షుడు కందూరి అయిలయ్య



సిద్దిపేట జిల్లా:

[ Streebuzz news Crime journalist ]

(ఉమ్మడి కొండపాక):- చిన్నతనం నుండే అమ్మా నాన్న లేకపొయిన కడు పేదరికాన్ని బరిస్తూ పట్టుదల వదలక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కుకునూర్ పల్లి మండల కేంద్రానికి చెందిన తుప్పటి కర్నాకర్ ను బీసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కందూరి అయిలయ్య అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవైపు తినడానికి తిండి లేక పోయినా తమ్ముడు , చెల్లెలిని సాదుకుంటూ వీలు కుదిరినప్పుడ్లా చదువుకొని తన పట్టుదలను వదలలేదన్నారు. సంకల్పం గట్టిగా ఉంటే సదించనిది లేదని కర్నాకర్ నిరూపించారని అన్నారు.ప్రతి కష్టాన్ని అధిగమించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నాకర్ ,నవీన్ ,డాక్టర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 23 2024, 07:54

పట్టుదల ముందు పేదరికం అడ్డు కదు బీసీ జిల్లా అధ్యక్షుడు కందూరి అయిలయ్య



సిద్దిపేట జిల్లా:


(ఉమ్మడి కొండపాక):- చిన్నతనం నుండే అమ్మా నాన్న లేకపొయిన కడు పేదరికాన్ని బరిస్తూ పట్టుదల వదలక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కుకునూర్ పల్లి మండల కేంద్రానికి చెందిన తుప్పటి కర్నాకర్ ను బీసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కందూరి అయిలయ్య అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవైపు తినడానికి తిండి లేక పోయినా తమ్ముడు , చెల్లెలిని సాదుకుంటూ వీలు కుదిరినప్పుడ్లా చదువుకొని తన పట్టుదలను వదలలేదన్నారు. సంకల్పం గట్టిగా ఉంటే సదించనిది లేదని కర్నాకర్ నిరూపించారని అన్నారు.ప్రతి కష్టాన్ని అధిగమించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నాకర్ ,నవీన్ ,డాక్టర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 23 2024, 07:38

ప్రజా ప్రభుత్వంలో అందరికి సమన్యాయం జరుగుతుంది - జిల్లా సీనియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్


సిద్దిపేట జిల్లా:


(నారాయణరావుపేట):- మండలంలోని జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల ముఖ్య సమావేశంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిద్దిపేట జిల్లా సినియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నిక అయిన గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు నక్క కాంతయ్య, అధ్యక్షులు బోయిని బాలయ్య, కార్యనిర్వహ అధ్యక్షుడు సారుగు హరికృష్ణ, ఉపాధ్యక్షుడు మాట్ల రాజు, ప్రధాన కార్యదర్శి మోసర్ల భూపతి రెడ్డి, కార్యదర్శులుగా జక్కుల బుచ్చెయ్య, దాకం కనకయ్య గార్లకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకుని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు..అదే విదంగా జక్కాపూర్ గ్రామంలో ఆనాటి నుండి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ బలంగా, ఐక్యమత్యంగా ఉందని, అదే ఐక్యమత్యంతో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి, అందరికి అందుబాటులో ఉండాలన్నారు.ఇంకా అనేక సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి, వాటన్నింటిని కూడా ప్రభుత్వ పెద్దల దృష్జికి ఎప్పటికప్పుడు తీసుకపోయి, పరిష్కారం చేసుకునెందుకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ వీర్, మండల కిసాన్ సెల్ అధ్యక్షలు రాజేశం గౌడ్, సీనియర్ నాయకులు పల్లె శ్రీనివాస్, చిన్నకోడూర్ సీనియర్ నాయకులు కనకయ్య, తీగల భాస్కర్, పల్లె పర్శరాములు, నిరుగొండ దేవయ్య,కయ్యాల అంజయ్య, గుండెల్లి వేణు, పల్లె ప్రశాంత్, జక్కుల కనకయ్యా, ఎండి షాదుల్, రఫి, పనుగట్ల రామచంద్రము తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 23 2024, 07:26

భక్తుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు




•చలివేంద్రాన్ని ప్రారంబించిన ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ ధర్మరాజు •


జయశంకర్ భూపాలపల్లి జిల్లా:



(మొగుళ్ళపల్లి ):- మండలంలోని ముల్కలపల్లి- మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగు సమీపంలో నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం ఎస్ బి ఐ మొగుళ్లపల్లి బ్రాంచ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ బి ఐ మొగుళ్ళపల్లి బ్రాంచ్ మేనేజర్ ధర్మరాజు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వనదేవతలైన శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా..మంచినీటి సమస్య తలెత్తకుండా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు మంచినీటి సమస్యను తీరుస్తున్న ఎస్ బి ఐ బ్రాంచ్ మేనేజర్ మరియు సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ పక్షాన కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ బి ఐ ఫీల్డ్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, బ్యాంక్ సిబ్బంది ఓదెలు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు, ఎండి రఫీ, యూత్ కాంగ్రెస్ మొగళ్లపల్లి మండల అధ్యక్షులు నీల రాజు కురుమ, కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 22 2024, 08:15

ఇచ్చిన మాటను 24 గంటల్లోపే అమలు చేసిన గజ్వేల్ ఏసిపి బాలాజీ

ధన్యవాదాలు తెలిపిన బార్ అసోసియేషన్ సభ్యులు

సిద్దిపేట జిల్లా:

[ Streebuzz news Crime journalist ]


(గజ్వేల్ ):- గజ్వేల్ బార్ అసోసియేషన్ సభ్యులు గజ్వేల్ కోర్టు ఎదురుగా ఉన్న రోడ్డులో వాహనాలు వేగంగా వస్తున్నాయని గతంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని గజ్వేల్ ఏసీపీ బాలాజీ కి తెలపగా ఏసిపి బార్ అసోసియేషన్ సభ్యులతో కలసి స్థలాన్ని సందర్శించి స్పీడ్ బ్రేకర్, గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఇచ్చిన మాటను 24 గంటల్లోపే అమలు చేసిన గజ్వేల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ బాలాజీ గారికి గజ్వేల్ బార్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ బార్ అసోసియేషన్ జాయింట సెక్రెటరీ ఎన్నెల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 22 2024, 07:50

పోలీస్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసిన బేగంపేట నూతన ఎస్ఐ



సిద్దిపేట జిల్లా:

[ Streebuzz news Crime journalist ]

• బేగంపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రవి కాంత్ రావు •

సిద్దిపేట జిల్లా బేగంపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రవి కాంత్ రావు,మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మేడమ్ గారిని కలసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడమ్ ఎస్ఐ.ను అభినందించి శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు. రాబోవు ఎంపీ ఎలక్షన్లో సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు.

Crimejournalist

Feb 22 2024, 07:24

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నామకరణం చేయాలనీ ప్రధాని మోడీకీ ఉత్తరం


©హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నామకరణం చేయాలనీ ప్రధాని మోడీకీ ఉత్తరం వేసిన - ప్రముఖసామాజిక కార్యకర్త, పీవీ సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు©


సిద్దిపేట జిల్లా:



[ Streebuzz news Crime journalist ]



(సిద్దిపేట జిల్లా 21-ఫిబ్రవరి):- హుస్నాబాద్ పోస్టాఫీస్ కార్యాలయం: భారత దేశంలో ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయానికీ(హైదరాబాద్ శంషాబాద్) భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పీవీ నరసింహారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పిడిశెట్టి రాజు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదేవిదంగా భారతప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపతి మూర్మ్, తెలంగాణ రాష్ట్ర సీఎం ఏనుముల రేవంత్ రెడ్డి లకులేఖ ద్వారా విజ్ఞప్తి చేశానని చెప్పారు.ఇటీవల భారత అత్యున్నత పురష్కారం భారతరత్న ప్రకటించిన సందర్బంగా పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టడం ఎంతవరకు సమంజసం ఆని, మేధావుల్లారా విద్యావంతులారా ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజు పేర్కొన్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో జన్మించిన ఆర్థిక సంస్కరణల పీతామాహుడు, బాహుబషా కోవిధుడు, మహనీయులు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని ఇట్టి విషయం పై ప్రతి ఒక్కరూ స్పందించాలనీ అన్నారు . ఈకార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు నమిలికొండ ఐలయ్య,గంగాధర్ రమేష్,పెనుకుంట్ల రాజ్ కుమార్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 21 2024, 13:41

గొల్ల,కురుమల రెండోవిడత గొర్రెల పంపిణీ కోసం వసూలు చేసిన DD లను వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీసీ జిల్లా అధ్యక్షుడుకందూరిఅయిలయ్య


సిద్దిపేట జిల్లా:

[ Streebuzz news Crime journalist]

(కుకునూర్ పల్లి ):- గత ప్రభుత్వ హయాంలో గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధి కోసం రెండో విడత గొర్రెల పంపిణీ అందజేస్తామని చెప్పడంతో అప్పులు చేసి డీడీలు కట్టిన గొల్ల కురుమలకు నిరాశ ఎదురైందని సిద్దిపేట జిల్లా బీసీ అధ్యక్షుడు కందూరి ఐలయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం లకుడారం గ్రామం పంచాయతీ ఆవరణలో జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు కందూరు ఐలయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గత బిఆర్ఎస్ ప్రభుత్వం మొదటి విడుదల సజావుగా అందజేసిందన్నారు. రెండో విడత పంపిణీ కొరకు గొల్ల కురుమల నుండి ఒక్క యూనిట్ కి , ఒక్కొక్కరికి 43,750 రూపాయల చొప్పున జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయల ను ప్రభుత్వం DD ల రూపంలో వసూలు చేసిందని తెలిపాడు.గొర్రెలు వస్తాయని తమ కుల వృత్తి పనిలో తాము అభివృద్ధి చెందుతామని ఆశపడ్డ వాళ్లకు ఇప్పటికీ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టకపోవడంతో నిరాశ కలిగించిందని ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటి ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకొని గొల్ల కురుమలకు న్యాయం జరిగేలా వెంటనే గొల్ల కురుమల DD లు కట్టిన డబ్బులను వారి వారికి అందజేయాలని కోరాడు.ఈ కార్యక్రమంలో లకుడారం గ్రామానికి చెందిన గొల్ల కురుమ సంగెం సభ్యులు పాల్గొన్నారు .

Crimejournalist

Feb 21 2024, 08:59

గజ్వేల్ కోర్టును సందర్శించి పెండింగ్ లో ఉన్న ట్రయల్ కేసుల గురించి వచ్చే నెల జరుగు లోకదాలత్ ల గురించి చర్చించిన ఏసిపి బాలాజీ


సిద్దిపేట జిల్లా:


[ Streebuzz news Crime journalist ]


(గజ్వేల్ 20-పిబ్రవరి):- గజ్వేల్ ఏసిపి బాలాజీ మంగళవారం కోర్టును సందర్శించి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మేడమ్ వి సౌమ్య, అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మేడమ్ ప్రియాంక, గార్లను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా పెండింగ్ ఉన్న ట్రయల్ కేసుల గురించి వచ్చేనెల తొమ్మిదిన జరుగు లోకదాలత్ గురించి చర్చించుకున్నారు.గజ్వేల్ బార్ అసోసియేషన్ సభ్యులు గజ్వేల్ కోర్టు ఎదురుగా ఉన్న రోడ్డులో వాహనాలు వేగంగా వస్తున్నాయని గతంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని ఏసీపీ గారికి తెలపగా ఏసిపి బార్ అసోసియేషన్ సభ్యులతో కలసి స్థలాన్ని సందర్శించి స్పీడ్ బ్రేకర్, గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Crimejournalist

Feb 21 2024, 08:38

పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించిన గజ్వేల్ ఏసిపి

సిద్దిపేట జిల్లా:



[Streebuzz news crime journalist]


(గజ్వేల్ 20-పిబ్రవరి ):- గజ్వేల్ ఏసిపి బాలాజీ తన కార్యాలయంలో పెండింగ్ ఉన్న కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు పెండింగ్ ఉన్న కేసుల గురించి సంబంధిత ఎస్ఐ సీఐలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ బాలాజీ మాట్లాడుతూ పారదర్శకంగా కేసుల దర్యాప్తు ఉండాలని, ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. ప్రతి అధికారి తప్పకుండా సంఘటనా స్థలాన్ని సందర్శించాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా కేసులను చేదించి త్వరగా చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. ఫోక్సో, ఎస్సీ ఎస్టీ, మహిళలకు సంబంధించిన కేసులలో ఎలాంటి జాప్యం లేకుండా 60 రోజులలో చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. సైబర్ నేరాల గురించి, మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి గ్రామాలలో పట్టణాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు, గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా జరగకుండా నిరంతరం నిఘా పెంచాలని తెలిపారు. నేరస్తులకు శిక్షలు పడే విధంగా కేసుల ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, తొగుట సిఐ లతీఫ్, తొగుట ఎస్ఐ లింగం, బేగంపేట ఎస్ఐ రవికాంత్ రావు, ములుగు ఎస్ఐ విజయ్, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.